UPSC Civil Services Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్.. మెరిసిన తెలుగు విద్యార్థులు!

UPSC Civil Services Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్.. మెరిసిన తెలుగు విద్యార్థులు!
x

UPSC Civil Services Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్.. మెరిసిన తెలుగు విద్యార్థులు!

Highlights

UPSC Civil Services Results 2025: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ - 2025 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

UPSC Civil Services Results 2025: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ - 2025 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 958 మంది అభ్యర్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత సర్వీసులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో ఉత్తర భారతానికి చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు.

టాప్ 10 ర్యాంకర్ల జాబితా:

జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది విజేతలు వీరే:

అనూజ్ అగ్నిహోత్రి

రాజేశ్వరి సువే

అకాంశ్ ధుల్

రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా

ఇషాన్ భట్నాగర్

జినియా అరోడా

ఏఆర్ రజా మొహియిద్దీన్

పక్షల్ సెక్రటరీ

అస్థా జైన్

ఉజ్వల్ ప్రియాంక్

మెరిసిన తెలుగు అభ్యర్థులు:

ఈ ఏడాది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఉనికిని చాటుకున్నారు. 55వ ర్యాంకుతో సృజన తెలుగు వారిలో టాపర్‌గా నిలవగా, మరికొందరు సాధించిన ర్యాంకులు ఇలా ఉన్నాయి:

సృజన (55), డీఎస్‌కే ప్రచేత్ (193), ఎస్ వర్షిత్ రెడ్డి (259), ఎం. పవన్ కుమార్ రెడ్డి (297). వెలిమినేటి విక్రమసింహారెడ్డి (541), గుమ్మల శ్వేత (573), పల్లి ప్రమోద్ విష్ణు (640), గుమ్మల విజయసింహారెడ్డి (682). మరికొంతమంది అభ్యర్థులు 700 నుండి 950 లోపు ర్యాంకులతో వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.

మొత్తంగా 958 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేయగా.. జనరల్‌ కేటగిరీ నుంచి 317 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఎంపికయ్యారు.

గతేడాది మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టులో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, తాజాగా తుది జాబితాను యూపీఎస్సీ వెల్లడించింది. విజేతలకు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories