వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల సబ్ జైలుకు తరలింపు

వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల సబ్ జైలుకు తరలింపు
x
Highlights

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ...

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా.. నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు నిందితులు తమను కడప జైలు నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి విచారించారు. వారి అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న కోర్టు ముగ్గురు నిందితుల్ని పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా ఎన్నిక‌ల ముందు వైయ‌స్ సోద‌రుడు వివేకానంద రెడ్డి హ‌త్య క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories