ప్రియురాలి ఇంట్లో యువకుడు అనుమానాస్పద మృతి

ప్రియురాలి ఇంట్లో యువకుడు అనుమానాస్పద మృతి
x
Highlights

ప్రియురాలి ఇంట్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన చెన్నై ఊలందూరుపేటలో జరిగింది. పల్లికరనై సమీపంలోని సిల్లుపాకం వళ్లువర్‌నగర్‌కు చెందిన...

ప్రియురాలి ఇంట్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన చెన్నై ఊలందూరుపేటలో జరిగింది. పల్లికరనై సమీపంలోని సిల్లుపాకం వళ్లువర్‌నగర్‌కు చెందిన కార్తీక్‌ (27) కారు డ్రైవర్‌, ఊలందూరుపేటకు చెందిన రాజేశ్వరి (24) ప్రేమించుకుంటున్నారు. రాజేశ్వరి పెరుంబాక్కం ఎళిల్‌నగర్‌లో ఉంటూ తరమణిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది.

కొన్ని నెలలుగా ఒంటరిగా అద్దె ఇంటిలో ఉంటున్న రాజేశ్వరి ఇంటికి కార్తీక్‌ తరచూ వెళుతున్నట్లు తెలిసింది. అయితే వారం కిది రాజేశ్వరి సొంతూరుకు వెళ్ళింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఆమె ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు లోపల కార్తీక్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని మృతదేహంపై చీమలు చుట్టుకుని ఉన్నట్టు గుర్తించారు.

కార్తీక్‌ కుడి పక్క నడుము భాగం, కుడి చేయి, కాలు భాగాల్లో గాయం ఉండటం గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories