ప్రాణాలను బలిగొన్న అతి వ్యాయామం

ప్రాణాలను బలిగొన్న అతి వ్యాయామం
x
Highlights

అతి వ్యాయామం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని ఓ జిమ్ సెంటర్ లో చోటుచేసుకుంది. పంజాబ్ కు చెందిన యువకుడు ఆదిత్య...

అతి వ్యాయామం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని ఓ జిమ్ సెంటర్ లో చోటుచేసుకుంది. పంజాబ్ కు చెందిన యువకుడు ఆదిత్య ప్రైవేటు కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. ఈ రోజు(సోమవారం) జిమ్ చేసిన తరువాత రూంకి వెళ్లిన తరువాత ఛాతి నొప్పిరావడంతో జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్ ఇచ్చారు. టాబ్లేట్ వేసుకున్నాక ఆదిత్య పరిస్థితి మరింత దీంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్టు వైద్యుల నిర్ధారించారు. ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories