రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేతలు దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేతలు దుర్మరణం..
x
Highlights

అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు కార్లలో వైసీపీ నేతలు,...

అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు కార్లలో వైసీపీ నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి బయలుదేరారు. ఈ తెల్లవారుజామున తుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి(69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బీఎల్‌ నాయుడు(55) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిని వారిని వెంటనే మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories