ప్రియుడు మోసం చేయడంతో చేయకూడని పని చేసిన మహిళ..

ప్రియుడు మోసం చేయడంతో చేయకూడని పని చేసిన మహిళ..
x
Highlights

మానవత్వం మంటగలిసింది. ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ పట్ల దారుణంగా..

మానవత్వం మంటగలిసింది. ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. మంటల్లో కాలుతున్నా ఆపే ప్రయత్నం చేయకుండా ఫోన్ లలో వీడియో తీశారు. ఈ దారుణ ఘటన చెన్నైలో జరిగింది. దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ టీ దుకాణం సమీపంలో మూడేళ్ల బిడ్డను ఓ మహిళ వదిలి వెళ్ళింది. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తట్టుకోలేక అరుస్తున్నా, మంటల్లో కాలుతున్నా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు.. పైగా సమీపంలో ఉన్న వాళ్లు తమ ఫోన్ కెమెరాల్లో ఈ దృశ్యాల్ని చిత్రీకరించారు. కొద్దిసేపటికే ఆమె మంటల్లో దగ్దమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఆమె పేరు మాలతిగా గుర్తించారు. అంతేకాదు.. ఆమెకు ఇదివరకే పెళ్లి అయిందని.. ఒక పాప కూడా ఉందని తెలుసుకున్నారు. కొద్దిరోజులుగా భర్తను వదిలి జీవిస్తున్న ఆమెను ఓ జీపు డ్రైవర్ రహస్యంగా వివాహం చేసుకున్నాడని తెలిసింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు. దీంతో మనస్థాపం చెందిన మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా ఆత్మహత్య చేసుకున్న ఆమెను నిలువరించకపోవడం దారుణం.

Show Full Article
Print Article
Next Story
More Stories