దారితప్పిన ప్రేమకు హత్యతో ముగింపు

దారితప్పిన ప్రేమకు హత్యతో ముగింపు
x
Highlights

ఇద్దరి ప్రేమ వ్యవహారమే ప్రియురాలి దారుణహత్యకు దారితీసింది. వీరివురి ప్రేమయాణంలో మునిగితేలుతున్న సమయంలో అనుమానాలు తలెత్తి ప్రియురాలి హత్యకు దారితీశాయి.

ఇద్దరి ప్రేమ వ్యవహారమే ప్రియురాలి దారుణహత్యకు దారితీసింది. వీరివురి ప్రేమయాణంలో మునిగితేలుతున్న సమయంలో అనుమానాలు తలెత్తి ప్రియురాలి హత్యకు దారితీశాయి. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం హొసూరు జిల్లా క్రిష్ట్రగిరిలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండగా ప్రియురాలిని దారుణంగా నరికిచంపి పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఎందుకు హత్యచేశావు అని నిందితుడిని పోలీసులు అడిగారు దీనికి నిందితుడు సమాధానం పోలీసులను నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలో కరుకన్ సావడి గౌండనేర్ కొటాయ్ గ్రామానికి చెందిన సెల్వి(32) ఈమేకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తను వదిలి ఒంటరిగా పిల్లలతో జీవనం గడుపుతోంది. క్రిష్ణగిరి జక్కప్పన్ నగర్ లో ఓ గిఫ్టల షాప్ లో పనిచేస్తుంది.

నిందితుడు దౌలత్‌ ఏమన్నాడంటే

కావేరిపట్టణం అన్నానగర్‌కు చెందిన దౌలత్‌ (24)తో ఓ దుస్తువుల దుకాణంలో పరియం అయిందని ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే సమయంలో తాను కష్టపడ్డ నెల జీతం మొత్తం సెల్వికి ఇచ్చేవాడినని. అయితే శనివారం సెల్వీ దౌలత్ కి ఫోన్ చేసి రూ.2వేలు అడిగింది. డబ్బులు తీసుకొని సెల్వీ పనిచేసే షాపు దగ్గరికి వెళ్లేసరికి తాను ఇంకేవరితోనో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడడంతో సెల్విని నిలదీశాడు. దీనికి సెల్వి మాట్లాడుతూ నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి నేను నీకు చెప్పవలిసిన అవసరంలేదని సమాధానం ఇచ్చింది దీంతో దౌలత్ ఆగ్రహానికిలోనై కత్తితో నరికి చంపాడు. పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories