ప్రియుడ్ని పెళ్లాడాలని భర్తని చంపేసింది

ప్రియుడ్ని పెళ్లాడాలని  భర్తని చంపేసింది
x
Highlights

మద్యం వ్యసనానికి బానిసైన భర్త నిరాదరణ ఆమె ను మరొకరికి దగ్గరయ్యేలా చేసింది. అక్రమ సంబంధానికి పురిగల్పింది. ఆ సంబంధం ముదిరి మరో పెళ్లి చేసుకోవాలనేంత...

మద్యం వ్యసనానికి బానిసైన భర్త నిరాదరణ ఆమె ను మరొకరికి దగ్గరయ్యేలా చేసింది. అక్రమ సంబంధానికి పురిగల్పింది. ఆ సంబంధం ముదిరి మరో పెళ్లి చేసుకోవాలనేంత గట్టిదైపోయింది. దానికి భర్తను హత్య చేయడమే మార్గమని ఆమె, అతని ప్రియుడు నిర్నయిన్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కడతేర్చారు. కొద్దికాలం నిశ్శబ్దం తరువాత ప్రియుడి దగ్గర నుంచి పెళ్లి కబురు వస్తుందని చూసింది. కానీ, అటువంటి ఆలోచనే అతనికి లేదని తెలిసింది. దీంతో ఉన్నదీ పోయే, ఉంచుకున్నదీ పోయే అనే తీరుగా మారింది ఆమె పరిస్థితి. చివరికి పోలీసుల దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరించి లొంగిపోయింది. వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని ఎలా మంట గలుపుతాయో చెబుతున్న ఈ సంఘటన జనగాం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని చిలుపూరుకు చెందిన వెలిశాల రవి(39), రజిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇంటిపక్కనే ఉండే మాచర్ల సాంబరాజుతో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రజిత-సాంబరాజులు రవిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రవిని హత్య అనంతరం రజితను పెళ్లాడతానని సాంబరాజు ఆమెకు హామీ ఇచ్చాడు.

ఈ ఏడాది జనవరి 29న మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రపోతున్న రవి మెడకు చున్నీ బిగించి ఇద్దరూ కలిసి హత్య చేశారు. అనంతరం అతిగా మద్యం తాగి తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ రజిత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. బంధువులు, గ్రామస్థులు కూడా ఆమె చెప్పింది నమ్మేశారు. భర్తను హతమార్చి నాలుగు నెలలు గడుస్తున్నా సాంబరాజు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో శనివారం పోలీసులను ఆశ్రయించిన రజిత.. తన భర్త హత్య, సాంబరాజుతో వివాహేతర సంబంధం తదితర విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories