ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
x
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించి ఓ మహిళ. ఈ ఘటన హైదరాబాద్ లోని చైతన్యపురిలో వెలుగుచూసింది. డిండి...

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించి ఓ మహిళ. ఈ ఘటన హైదరాబాద్ లోని చైతన్యపురిలో వెలుగుచూసింది. డిండి మండలం, దేవత్‌పల్లి తండాకు చెందిన బానోవత్‌ శంకర్‌ (33)కు కొన్నేళ్ళకిందట విజయతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. బ్రతుకుదెరువుకోసం నగరానికి వలస వచ్చి చైతన్యపురిలో ఉంటూ కూలీ పనికి వెళుతున్నాడు శంకర్. ఈ క్రమంలో శంకర్ భార్య విజయ వరుసకు మరిది అయ్యే సపావత్‌ కిషన్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే దీన్ని మానుకోవాలని పలుమార్లు భార్యను మందలించాడు శంకర్.

ఒకటిరెండు సార్లు తీవ్రమైన గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయినా కూడా ఆమె వినలేదు.. పైగా తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గత శనివారం రాత్రి మద్యం తాగిన శంకర్‌ నిద్రలో ఉండగా విజయ, కిషన్‌ అతని ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్లు నాటకం ఆడారు. విజయ వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేసిన శంకర్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories