ప్రేమజంటపై ఇనుపరాడ్ తో దాడి.. యువతి మృతి..

ప్రేమజంటపై ఇనుపరాడ్ తో దాడి.. యువతి మృతి..
x
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మంగళగిరి మండలం...

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని అమరావతి స్టేడియంలో సోమవారం రాత్రి జరిగింది. తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళ్లొస్తానని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన జ్యోతి.. శ్రీనివాసరావుతో కలిసి ఇద్దరూ రాత్రి అమరావతి స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వారిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. శ్రీనివాసరావు, జ్యోతిపై ఇనుప రాడ్డుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడిలో జ్యోతి అక్కడిక్కడే మృతిచెందింది. శ్రీనివాసరావు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వారు కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి అత్యాచారానికి నిరాకరించడంతోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పథకం ప్రకారం జరిగిందా… లేక ఆకతాయిలు ఇలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories