దంపతుల ఆత్మహత్య

దంపతుల ఆత్మహత్య
x
Highlights

ఆర్థిక సమస్యలు వారి జీవితాన్ని కకావికలం చేశాయి. దాంతో జీవితంపై విరక్తి చెంది దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా గడికించుమండలో...

ఆర్థిక సమస్యలు వారి జీవితాన్ని కకావికలం చేశాయి. దాంతో జీవితంపై విరక్తి చెంది దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా గడికించుమండలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని రంగశీల పంచాయతీ ఇరుకువలసకు చెందిన కొర్రా రామచంద్రరావు(21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గడికించుమండకు చెందిన రేణుక(20)ను ప్రేమించి పెద్దల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. ఇటీవల రేణుక తన తల్లి వద్ద రూ.లక్షన్నర అప్పుచేసి భర్త రాంచంద్రరావుకు ఇచ్చింది. సొమ్ముతో జీపు కొనుగోలు చేసి సొంతంగా నడుపుకుని జీవించాలని భావించారు. అయితే ఆ డబ్బును వీరు దుబారా చేశారు. దాంతో దంపతులమధ్య తరచు గొడవలు జరుగుతుండేవి.. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు కూడా ఆదరించడం మానేశారు.

దాంతో రేణుక తన పుట్టింటికి వెళ్లిపోయింది. శనివారం రాత్రి 12గంటల సమయంలో రామచంద్రరావు గడికించుమండ వెళ్లాడు. దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం రేణుకను బైక్‌పై ఎక్కించుకుని రామచంద్రరావు వెళ్లిపోయాడు. ఇద్దరూ ఇరుకువలస వెళ్లి ఉంటారని కుటుంబసభ్యులు భావించారు. ఆదివారం ఉదయానికి గడికించుమండ సమీపంలోని వ్యవసాయ భూముల వద్ద రేణుక చున్నీ,సెల్‌ఫోన్‌లు కనిపించాయి. గ్రామస్థులు సెల్ ఫోన్ , చున్నీ ఆధారంగా బావిలోకి చూడగా మృతదేహాలు తేలుతూ కనిపించాయి. దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రే ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులను విచారించగా కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories