మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. తల,మొండెం వేరు చేసి..

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. తల,మొండెం వేరు చేసి..
x
Highlights

దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచార పర్వాలు కొనసాగుతునే ఉన్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న...

దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచార పర్వాలు కొనసాగుతునే ఉన్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు వారిని హతమార్చి వికృతానందం పొందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లోని జంషెడ్ పూరక లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలియని మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. ఆ పై దారుణ హత్యకు ఒడిగట్టారు. ఇక వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటానగర్ రైల్వే స్టేషన్‌లో జూలై 25వ తేదీన రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ తల్లి, ఆమె కుమార్తె (3) నిద్రిస్తున్నారు. అక్కడికి ఓ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.

అనంతరం జూలై 30వ తేదీన ఆ చిన్నారి తల లేకుండా కేవలం మొండెం మాత్రమే కనిపించింది. కాగా మొండాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా, నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను హత్య చేసే ముందు చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారం చేసినట్లు తెలిసింది. అయితే బాలిక తమను ఎక్కడ గుర్తుపడుతుందోమోనని నిందితులు చిన్నారిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఎత్తుకెళ్తున్న సమయంలో అక్కడ రికార్డయిన సీసీ కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ చిన్నారిని అపహరించిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పాత నేరస్థుడేనని, అతని పేరు రింకూయేనని పోలీసులు నిర్దిరాంచారు. ఈ క్రమంలో పోలీసులు రింకూతోపాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. కాగా వారు ఆ చిన్నారిని తీవ్రంగా హింసించి అత్యాచారం చేశారని, ఆపై ఆమె తల నరికారని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories