కామారెడ్డిలో దోపిడి దొంగల బీభత్సం

కామారెడ్డిలో దోపిడి దొంగల బీభత్సం
x
Highlights

కామారెడ్డిలోని విద్యుత్‌నగర్‌ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం వరుస...

కామారెడ్డిలోని విద్యుత్‌నగర్‌ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం వరుస చోరీలకు పాల్పడ్డ దొంగలు 36 తులాల బంగారంతో పాటు 3 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఇల్లు కూడా ఉంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇది అంతర్‌ రాష్ట్ర ముఠా అనే అనుమానాలున్నాయని దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని కామారెడ్డి అడిషనల్‌ ఎస్పీ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories