ప్రేమ వేధింపులకు మరో యువతి బలి

ప్రేమ వేధింపులకు మరో యువతి బలి
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ప్రేమ వేధింపులు తాళలేక ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి...

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ప్రేమ వేధింపులు తాళలేక ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన అఖిల్ రాజేష్ అనే బాలుడు బాలుడు వేధిస్తుండటంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక తనువు చాలించింది. బాలిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ టిక్‌టాక్‌ వీడియో చేసి రాజేష్ వాట్సాప్‌లో పెట్టాడు దీనిని గమనించిన పిల్ల తండ్రి పోలీసుసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాలుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories