తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు
x
Highlights

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని కొడుకు అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం తాళ్లపాడులో మంగళవారం (సెప్టెంబర్ 3) ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని కొడుకు అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం తాళ్లపాడులో మంగళవారం (సెప్టెంబర్ 3) ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటాపూర్ సీఐ కొత్త దేవేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాళ్లపాడుకు చెందిన గొర్రె సుశీల (50) తన కుమారుడు వేణుతో కలిసి స్వగ్రామంలో నివాసం ఉంటోంది. సుశీల భర్త గురుమూర్తి మొదటి భార్యతో కలిసి బతుకుదెరువు కోసం కరీంనగర్‌ జిల్లాకు వలస వెళ్లాడు. సుశీల కొడుకు వేణు వేధింపులు పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతూ తాగుడికి బానిసయ్యాడు. తరుచూ తాగడానికి డబ్బులు కావాలని తల్లిని రోజూ వేధిస్తుండేవాడు.

అయితే ఒక రోజు సుశీల తనకు మందులు తీసుకురమ్మని కుమారుడు వేణుకు ఇటీవల రూ.1000 ఇచ్చింది. అయితే ఎంతకూ కూడా మందులు తీసుకురాకపోవడంతో కొడుకుని నిలదీసింది. మందులేవని కొడుకుని గట్టిగ అడిగింది దినికి సామాధానం ఇస్తూ తాగుడుకు ఖర్చు చేశానని చెప్పాడు. తనకు మరిన్ని డబ్బులు కావాలని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. డబ్బులు లేవు ఏంలేవు తెల్చిచెప్పింది. దీంతో తీవ్ర కోప్రగ్రస్థుడైన వేణు ఆవేశంతో రగిలిపోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వేణు తన తల్లిని కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆమె అర్ధరాత్రి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత కర్రతో తలపై బలంగా బాదీ.. కాళ్లు, చేతులు వెనక్కి విరిచాడు. ఆమె విలవిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచింది. సుశీల హత్యకు గురైన విషయాన్ని తెల్లవారు జామున స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న ములుగు సీఐ కొత్త దేవేందర్‌ రెడ్డి తన బృందంతో వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories