ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
x
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనెర్ ను కారు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో...

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనెర్ ను కారు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో జరిగింది. మృతులు మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారి కుటుంబసభ్యులుగా గుర్తించారు. తమిళనాడులో పర్యాటక ప్రాంతాలను వీక్షించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories