సైకో శ్రీనివాస్‌రెడ్డి ప్రేమాయణం.. ఆ యువతితో..

సైకో శ్రీనివాస్‌రెడ్డి ప్రేమాయణం.. ఆ యువతితో..
x
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో అమ్మాయిల హత్యల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పదో తరగతి విద్యార్థిని శ్రావణి,...

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో అమ్మాయిల హత్యల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పదో తరగతి విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థిని మనీషా తరహాలోనే నాలుగేళ్ల కిందట కల్పన అనే బాలికను కూడా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో మర్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇదిలావుంటే బాలికలను హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డి ఓ అమ్మాయితో ప్రేమయానం కూడా నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసినట్టు సమాచారం. శ్రీనివాస్‌ రెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతాపై పోలీసులు ఆరా తీయగా ఓ అమ్మాయితో కలిసి తీసుకున్న ఫోటోలు కనిపించాయి. ఆమె సిరిసిల్లా జిల్లా వేములవాడకు చెందిన యువతిగా గుర్తించారు. వేములవాడ దేవస్థానికి వెళ్లినప్పుడు ఆ యువతితో పరిచయం ఏర్పడినట్టు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories