ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
x
Highlights

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. టైర్...

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. టైర్ పేలిపోవడంతో అదుపుతప్పిన బొలెరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మరణించగా ఆర్టీసీ బస్సులోని 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండమల్లేపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే స్ధానిక పొలీసులు, రెవిన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories