నిర్మల్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మల్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

నిర్మల్‌ , సంగారెడ్డి జిల్లాల్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా మామడ వండలం పరిమండల్‌...

నిర్మల్‌ , సంగారెడ్డి జిల్లాల్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా మామడ వండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన గున్నాల రాజాగౌడ్‌ , దొంతుల రాజేశ్వర్‌ (50)లు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై నిర్మల్‌ పట్టణానికి వస్తుండగా టిప్పర్‌ ఢీకొంది. దీంతో టిప్పర్‌ కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన 16మంది హైదరాబాద్‌లో వివాహానికి హాజరయ్యేందుకు తుఫాన్‌ వాహనంలో బయలు దేరారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఎరువుల లోడ్‌తో వచ్చిన లారీ.. తుఫాన్‌ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో తుఫాన్‌ వాహన డ్రైవర్‌ మన్నాన్‌(38), శివాని సర్సంబే (30) స్పాట్ లోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రజిని(60)ని, బాలుడు(10 మాసాలు) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories