కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన బనగానపల్లెలోని యాగంటికి సమీపంలో జరిగింది. యాగంటికి చెందిన మోటరు...

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన బనగానపల్లెలోని యాగంటికి సమీపంలో జరిగింది. యాగంటికి చెందిన మోటరు బైక్‌ను తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దాంతో అక్కడిక్కడే ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఒక యువకుడున్నారు. వీరిని కర్నూలులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వీరిని ఆస్పత్రికి తరలించారు. యాగంటి ఆలయం నుంచి తిరిగి వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మోటారు బైక్ ను ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories