గోశాలలో 22 ఆవులు మృతి ... 52 ఆవులను రక్షించిన వైద్యులు

గోశాలలో 22 ఆవులు మృతి ... 52 ఆవులను రక్షించిన వైద్యులు
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని ఓ గోశాలలో 22 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 52 ఆవులను వైద్యులు రక్షించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని ఓ గోశాలలో 22 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 52 ఆవులను వైద్యులు రక్షించారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆవులు మరణించడంతో గోశాల సంరక్షకుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. కాగా.., జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో 22 ఆవులు మృతి చెందిన విషయం తెలిసి అక్కడి చేరుకున్నామని 52 ఆవులను రక్షించామని తెలిపారు. సజ్జ ఆకుల్లో విషవాయువులు ఎక్కువగా ఉందని, నైట్రేట్ విషంతోనే గోవులు మరణించినట్టు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories