వారిద్దరినీ వేధించింది ఒక్కడే!

వారిద్దరినీ వేధించింది ఒక్కడే!
x
Highlights

సాంఘిక మాధ్యమాల్లో వేధింపులకు దిగడం.. రకరకాలుగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు వ్యాప్తి చేయడం సహజమైపోయింది. అలా వేధింప బడుతున్న వారి సంఖ్యా తక్కువేమీ...

సాంఘిక మాధ్యమాల్లో వేధింపులకు దిగడం.. రకరకాలుగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు వ్యాప్తి చేయడం సహజమైపోయింది. అలా వేధింప బడుతున్న వారి సంఖ్యా తక్కువేమీ కాదు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ వరుసలో ముందుంటున్నారు. కొందరు ఈ విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు ఈ గోల ఎందుకని వదిలేస్తున్నారు.

ఆ మధ్య కాలంలో నటి పూనం కౌర్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి పైన విపరీతమైన వేధింపుల పోస్టులు వెల్లువెత్తాయి. వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించిన పోలీసులకు ఆసక్తికరమైన క్లూస్ దొరికాయి. ఈ ఇద్దరినీ వేధింపులకు గురిచేసింది ఒక్కరే అని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడితో పాటు మరో వ్యక్తి ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని తెలుసుకున్నారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories