ప్రముఖ వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జయరాం ను రాకేష్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసు...
ప్రముఖ వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జయరాం ను రాకేష్ రెడ్డి హత్య చేసినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసులో దాదాపు 100 మందిని పైగా విచారించారు. ఇందులో కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు ఒకరిద్దరు పోలీసులను కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ఉంచే అవకాశముండగా.. జయరాం మర్డర్ వ్యవహారంలో సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని కూడా విచారించినట్టు సమాచారం. ఇప్పటికే సుభాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
జయరామ్ హత్య అనంతరం సుభాష్ రెడ్డి కి రాకేశ్రెడ్డి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నగేష్, విశాల్, సుభాష్ రెడ్డిలను మంగళవారం మీడియా ముందుకు తీసుకురానున్నారు. అలాగే జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై కూడా విచారణ జరిపేందుకు తగిన న్యాయసలహా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire