ఆ మహిళ చావుకు చేతబడి కాదు..

ఆ మహిళ చావుకు చేతబడి కాదు..
x
Highlights

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో చేతబడి చేసి మహిళ చావుకు కారణం అయ్యాడని, చితిలోకి తోసేసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన తెలిసిందే. కేవలం మూఢ నమ్మకం కారణంగానే ఈ ఘోరం జరిగిందని తేల్చింది. ఘటన జరిగిన ఆద్రాస్‌పల్లి గ్రామంలో జన విజ్ఞాన వేదిక నిజ నిర్ధారణ కమిటీ, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలను వెల్లడించారు

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో చేతబడి చేసి మహిళ చావుకు కారణం అయ్యాడని, చితిలోకి తోసేసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన తెలిసిందే. కేవలం మూఢ నమ్మకం కారణంగానే ఈ ఘోరం జరిగిందని తేల్చింది. పైల్స్ వ్యాధే యువకుడి పట్ల శాపంగా మారినట్లు వెల్లడైంది.

జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం నేతృత్వంలో, ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ పలువురు గ్రామంలో పర్యటించారు. శామీర్‌పేట సీఐ కె శంకర్, సర్పంచ్ లలిత నర్సింహ్మ ఉన్నారు. ఘటన జరిగిన ఆద్రాస్‌పల్లి గ్రామంలో జన విజ్ఞాన వేదిక నిజ నిర్ధారణ కమిటీ, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలను వెల్లడించారు కమిటీ సభ్యులు. గ్రామంలో లక్ష్మి అనే మహిళ గత 6 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. డయాలసిస్ , షుగర్ కారణంగా కాలు కూడా తీసివేశారు.

అనారోగ్యంతో ఆమె బుధవారం చనిపోయింది. అదే రోజు సాయంత్రం ఆమె దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆంజనేయులు పైల్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు. దీంతో అతడు కొంతకాలంగా రాత్రి భోజనం చేసిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వద్దకు వెళ్తున్నాడు. అదే అలవాటుతో బుధవారం రాత్రి అంత్యక్రియలు జరుగుతుండగా అటు వైపు వచ్చాడు. దీంతో ఘోర దుర్ఘటన జరిగింది. అది చూసిన మహిళ బంధువులు అతడే చేతబడి చేసి చంపేశాడని, అందుకే ఇటువైపు వచ్చాడని అనుమానించారు. అతడిపై దాడిచేసి అదే చితిమంటల్లో వేసి, అతి దారుణంగా చంపారు.మృతురాలు లక్ష్మి, ఆంజనేయులు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని తేలింది. ఈ అంశంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామని కమిటీ సభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories