30 మందిని రేప్ చేసి మరీ డబ్బులు గుంజాడు!

30 మందిని రేప్ చేసి మరీ డబ్బులు గుంజాడు!
x
Highlights

మన దేశంలో లైంగిక కార్యకలాపాల్ని అతి రహస్యంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పై జరిగిన చిన్న పాటి వేధింపులనూ బయటకు కాదు కదా.. కనీసం కనిపెంచిన...

మన దేశంలో లైంగిక కార్యకలాపాల్ని అతి రహస్యంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పై జరిగిన చిన్న పాటి వేధింపులనూ బయటకు కాదు కదా.. కనీసం కనిపెంచిన తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. సరిగ్గా ఇదే రేపిస్ట్ ల పాలిట వరంగా మారుతోంది. ప్లేబాయ్ లా జీవితాన్ని గడపాలనుకునే కామాంధులకు ఆడపిల్లల్లోని ఈ సమస్యే ఆయుధంగా మారుతోంది. సరిగ్గా ఇదే సామాజిక లోపాన్ని ఆసరాగా తీసుకున్న కామాంధుడొకడు 30 మంది మహిళల జీవితాల్ని నాశనం చేశాడు. వీలైనంత వరకూ లొంగ తీసుకోవడం.. లేకపోతె బలాత్కరించడం.. జరిగిన వాటిని వీడియోలు తీయడం.. వాటితో మళ్లీ బాధిత మహిళలను బెదిరించి డబ్బులు గుంజడం ఆ మృగాడి అకృత్యాలు. ఆఖరుకు ధైర్యం చేసి ఓకే మహిళ ఇచ్చిన ఫిర్యాదు తో ఈ క్రూరుడి వివరాలు బయటకు వచ్చాయి. లేకపోతె మరెంత మంది జీవితాలను నాశనము చేసేవాడో?

ఛత్తీస్‌ఘడ్‌లోని బియెల్లీ దగ్గర్లో ఉన్న వైశాలీనగర్ ఏరియాకు చెందిన గగన్‌దీప్ సింగ్ అలియాస్ రిచే... అమ్మాయిలకు మాటలతో పడేసి, లొంగదీసుకోవడంలో దేశముదురు. నిమిషాల్లో మాటలు కలిపి, గంటల్లో స్నేహం పెంచుకుని దగ్గరై పోయే గగన్‌దీప్ సింగ్... ప్రేమ పేరుతో అమ్మాయిలకు దగ్గరవుతాడు. అతని మత్తైన మాటలు నమ్మిన అమ్మాయిలు... పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. వారి ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే గగన్‌దీప్... వారిని తన గదికి తీసుకెళ్తాడు. అక్కడ వారిని లొంగదీసుకుని శృంగారం చేస్తాడు. లొంగకపోతే అత్యాచారానికి పాల్పడతాడు. తన గదిలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ దృశ్యాలను రికార్డు చేసి... వాటిని చూపించి లక్షలు డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, అందినకాడిని తీసుకుని తప్పించుకునేవాడు. ఇలా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్, బియెల్లీ ఏరియాల్లో మహిళలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రాయ్‌పూర్, జగ్దల్‌పూర్, జోధ్‌పూర్, ఇండోర్ ఏరియాల్లో అమ్మాయిలను ఈ విధంగా ట్రాప్ చేసి మోసం చేశాడు గగన్‌సింగ్.

పోలీసులకు చెబితే ఫోటోలు, వీడియోలను బూతు సైట్లలో పెడతానని బెదిరించడంతో ఎవ్వరూ గగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అయితే బియెల్లీ ఏరియాకు చెందిన ఓ మహిళ, తనకు జరిగిన అనుభవాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితుడిగా పరిచయమైన గగన్‌ను ఇంటికి పిలిస్తే.. ఎవ్వరూ లేని సమయంలో తనపై అత్యాచారం చేసిన అతను... రెండు లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, తన భర్తకు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... గగన్‌దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసి, అతని మొబైల్‌ చెక్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇలా పెళ్లైన మహిళలు, కాలేజీకెళ్లే స్టూడెంట్స్‌తో మాటలు కలిపిన అతను... అత్యాచారం చేయడం, వారిని లొంగదీసుకుని శృంగారం చేయడం చేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ దృశ్యాలు ఫోటోలు, వీడియోల్లో బంధించి బాధితుల నుంచి లక్షలు వసూలు చేశాడని నిర్ధారణ అయ్యింది. గగన్‌దప్ సింగ్ కేసును ఛాలెజింగ్‌గా తీసుకున్న పోలీసులు... అతను ఎంత మందిపై అత్యాచారం చేశాడు? వారి నుంచి ఎంత వసూలుచేశాడనే విషయాలను తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories