భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త

భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త
x
Highlights

అనుమానం పెనుభూతమైంది. అనుమానం కారణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త.. ఆపై ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలోని...

అనుమానం పెనుభూతమైంది. అనుమానం కారణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త.. ఆపై ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. జక్కంపూడి కాలనీకి చెందిన అవనిగడ్డ నరసింహారావు, కృష్ణకుమారికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. నరసింహారావు వెల్డింగ్‌ పనులు చేసేవాడు. తొలి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న ఆయన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడలేదు. మూడు రోజుల కిందట కృష్ణకుమారి ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో ఉంటున్న అక్క దగ్గరకు వెళ్లింది.

శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణకుమారి భోజనం చేసి నిద్రపోయింది. బయటినుంచి ఇంటికి వచ్చిన నరసింహారావు ఇంట్లో ఉన్న భార్యను ఆవేశంతో గొడ్డలితో తలపై మోదడంతో కృష్ణకుమారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ విషయం అందరికి తెలిసిపోతుందన్న భయంతో ఇంటిలోనే ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కుమారుడు వచ్చి చూసే సరికి లోపల తండ్రి ఉరి వేసుకుని ఉండటం, మంచంపై తల్లి గాయాలతో చనిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నందు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories