సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్.. యువకుడు మృతి

సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్.. యువకుడు మృతి
x
Highlights

సంక్రాంతి కోసం సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో అనుకోని ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి యువకుడు...

సంక్రాంతి కోసం సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో అనుకోని ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుర్రం రాజశేఖర్ ఈ రోజు ఉదయం సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంటు షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల వారు వచ్చే లోపే కుప్పకూలడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పండగ సమయంలో ఇంటి పెద్దను కోల్పోయామంటూ భార్య, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉండటం చుట్టుపక్కల వారిని కూడా కన్నీరు పెట్టిస్తోంది. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే గ్రామంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories