మరో పరువు హత్య వెలుగులోకి..

Highlights

ఇటీవల పరువుహత్యలు పెరిగిపోతున్నాయి. మిర్యాలగూడ, మంచిర్యాల ఘటనలు మరవకముందే మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. శనివారం హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరిలో...

ఇటీవల పరువుహత్యలు పెరిగిపోతున్నాయి. మిర్యాలగూడ, మంచిర్యాల ఘటనలు మరవకముందే మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. శనివారం హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరిలో నందకిషోర్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య భార్య తరపున బంధువులే చేశారని పోలీసులు భావిస్తున్నారు. నాలుగేళ్లకిందట తిరిమలగిరిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే ఇది ఇష్టం లేని యువతి తలిదండ్రులు.. అల్లుడిపై కక్ష పెంచుకున్నారు. నాలుగేళ్లుగా వీరిమధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దారుణంగా నందకిషోర్ ను కొట్టి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో పరువు హత్య వెలుగులోకి..

Show Full Article
Print Article
Next Story
More Stories