ఈజీ మనీ కోసం వరుస పెళ్లిళ్ళు.. స్వీట్‌గా మాట్లాడి అమ్మాయిలను..

ఈజీ మనీ కోసం వరుస పెళ్లిళ్ళు.. స్వీట్‌గా మాట్లాడి అమ్మాయిలను..
x
Highlights

కష్ట పడకుండా ఈజీగా మనీ సంపాదించడానికి కొందరు దొంగతనాలు చేస్తారు. ఇంకొకరు మోసాలు చేస్తారు. కానీ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ప్రవీణ్ మాత్రం...

కష్ట పడకుండా ఈజీగా మనీ సంపాదించడానికి కొందరు దొంగతనాలు చేస్తారు. ఇంకొకరు మోసాలు చేస్తారు. కానీ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ప్రవీణ్ మాత్రం పెళ్లిని నమ్ముకున్నాడు యువతులతో స్వీట్ గా మాట్లాడి పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వారితో అసభ్యకరమైన ఫోటోలు దిగి డబ్బులు గుంజడం ఈ నిత్యపెళ్లికొడుకు నైజం. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ ప్రభుద్ధుడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ అదే ప్రాంతంలో ఉంటున్న రాజేశ్వరి అనే యువతిని తనకు ఎవరూ లేరని చెప్పి వివాహం చేసుకున్నాడు. 2019 మే 10న వీరి వివాహం జరిగింది. అనంతరం రాజేశ్వరి పేరుతో 3 బ్యాంకు ఖాతాలు తెరిపించి. ఆమె వద్దనున్న బంగారం తాకట్టు పెట్టి రెండు లక్షల వరకూ రుణాలు తీసుకుని జల్సా చేసుకున్నాడు. ఆమె దగ్గరున్న నగదును కూడా కాజేసి జల్సా చేశాడు.

రాజేశ్వరిని పెళ్లి చేసుకోక ముందే ప్రవీణ్ కు పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ ఆమెకు చెప్పకుండా పెళ్లి అయ్యింది ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నా అని చెప్పి రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు తెలుసుకొని ఆమె షాక్ తింది. మా వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ రాజేశ్వరిని ప్రవీణ్ మొదటి భార్య తరపు వారు వచ్చి కొట్టారు. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ప్రవీణ్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

తాను మోసపోయానని గ్రహించిన రాజేశ్వరి స్థానిక పీఎస్‌లో ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు బయట పడ్డాయి. గతంలో కూడా ప్రవీణ్ యువతులను లొంగదీసుకుని వారితో అసభ్యకరంగా ఫోటోలు దిగి ఆ తర్వాత వాటితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories