భర్తను మటన్ తీసుకురమ్మని చెప్పి... ప్రియుడితో కలిసి..

భర్తను మటన్ తీసుకురమ్మని చెప్పి... ప్రియుడితో కలిసి..
x
Highlights

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన హత్యకేసు మిష్టరీని పోలీసులు ఛేదించారు. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయింది.

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయింది. గత నెల 21 జరిగిన విస్టరీస్ హత్య కేసును మహబూబాబాద్ పోలీసులు సవాలుగా తీసుకున్నారు. హత్య సంబంధించిన వివరాలు సేకరించి,నిందితులను అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా రూరల్ మంగలికాలనీకి చెందిన నవీన్ పెయింటర్‎గా పనిచేస్తున్నాడు. అతనికి రేగడితండాకు చెందిన శాంతితో వివాహమైంది. నవీన్ ఎక్కువగా పని నిమిత్తం బయట ఉంటున్నాడు. ఇదే సమయంలో అతని భార్య శాంతి, వెంకటేశ్ అనే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం నవీల్ దృష్టికి రావడంతో భార్య శాంతిని పలుమార్లు హెచ్చరించాడు. అయిప్పటికి శాంతి వినలేదు వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో నవీన్ హత్య చేయాలని శాంతి ఆమె ప్రియుడు వెంకటేశ్‎తో కలిసి పథక రచన చేశారు. వారి పథకం ప్రకారమే రేగడితండలోని శాంతి పుట్టింటికి వెళ్లింది. కాగా...ఈనెల 21న నవీన్ కు ఫోన్ చేసి మటన్ తీసుకురావాలని కోరింది. దీంతో ద్విచక్ర వాహనంపై నవీన్ రేగడితండకు బయలుదేరాడు. మార్గ మధ్యలో నవీన్ వాహనాన్ని శాంతి ప్రియుడు వెంకటేశ్, అతని స్నేహితుడు కాపుకాసి అడ్డుకున్నారు. అతని తలపై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేశారు. నవీన్ పడిపోవడంతో అతని మెడకు రూమాలు బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రికరించారు. ఏమి తెలియనట్లుగా భర్త మరణవార్త విని శాంతి శోకాండాలు పెట్టింది. శాంతి వివాహేతర సంబంధం గురించి తెలిసిన నవీన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. నవీన్ భార్య శాంతి కాల్‎డేటా ఆధారంగా తన ప్రియుడుతో కలిసి నవీన్‎ను హత్య చేయించిందని తెలుసుకున్నారు. దీంతో శాంతిని, వెంకటేశ్ ను హత్యకు సహకరించిన అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేసినట్ల పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories