యాసిడ్ తాగించి.. సిగరేట్లతో కాల్చి.. మాజీ భర్త అత్యాచారం

యాసిడ్ తాగించి.. సిగరేట్లతో కాల్చి.. మాజీ భర్త అత్యాచారం
x
Highlights

ఓ మహిళను ఆమె రెండేళ్ల కుమార్తెను అపహరించి నరకం చూపించాడు ఓ మాజీ భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో‎ని రత్నాం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం. రత్నాం జిల్లాకు చెందిన ఓ మహిళతో ఏనిమిదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహవైంది.

భార్యను ఆమె రెండేళ్ల కుమార్తెను అపహరించి నరకం చూపించాడు ఓ మాజీ భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో‎ని రత్నాం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం. రత్నాం జిల్లాకు చెందిన ఓ మహిళకి ఏనిమిదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహవైంది. వారికి ఇద్దరు సంతానం కొంతకాలం వరకు వారి మధ్య దాంపత్యం అనోన్యంగా సాగింది. కాగా.. ఏడాది క్రితం వారి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇది జీర్ణించుకోని ఆమె మాజీ భర్త ఆమెపై మరింత కక్ష్య పెంచుకున్నాడు. ఆ మహిళను రెండేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి నిర్జివ ప్రదేశంలోకి తీసుకుకెళ్లాడు. వారిని కిడ్నాప్ చేయడానికి మాజీ భర్త చెల్లల కుమారులు సహకరించారు. అంతా కలిసి పథకం ప్రకారం వారిని కిడ్నాప్ చేశారు.

అపహరించిన మహిళను ఆమె కుమార్తెను రోండు రోజులపాటు వారు నరకం చూపించారు. ఖర్చోడ్‌ ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి చిన్నారి చూస్తుండగానే ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీరంపై సిగరెట్లతో కాల్చారు. బలవంతంగా ఆమ్లం తాగించారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లింది ఆ మహిళ. అనంతరం ఆమెను కాలి ప్రదేశం పడేసివెళ్లారు.

నిర్జివ పడివుండాన్ని గమనించిన స్థానికులు ఆమెను రత్లాంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దారుణ ఘటనపై సమాచారం తెలుసున్న పోలీసులు బాధితురాలి దగ్గర వాంగ్మూలం తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బాధితురాలి మాజీ భర్త పరారీలో ఉన్నారు ఇద్దరు మేనల్లుళ్లను అరెస్ట్ చేశారు. తల్లి అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసి చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories