ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం
x
Highlights

ప్రియురాలిని కలవాలని వచ్చి యువకుడు శవమయ్యాడు. దీంతో ఆ యువకుని తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని యువతి ఇంటి ముందు ధర్నాకు దిగారు. అమ్మాయి తరుఫు వారే...

ప్రియురాలిని కలవాలని వచ్చి యువకుడు శవమయ్యాడు. దీంతో ఆ యువకుని తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని యువతి ఇంటి ముందు ధర్నాకు దిగారు. అమ్మాయి తరుఫు వారే తమ కొడుకును చంపారంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు యువతిని, ఆమె కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని కలవడానికి ఒంగోలు వచ్చిన ప్రేమికుడు... ప్రేమికురాలి ఇంటి ముందు శవంలా కనిపించాడు. తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి, ఒంగోలు గోపాలనగరానికి చెందిన కల్యాణి బంధువులు. అయితే అవినాష్‌ రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కల్యాణి కూడా అక్కడే చదువుతుంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. చదువు ముగించుకుని ఒంగోలు వచ్చిన కల్యాణిని కలవడానికి అవినాష్‌ శనివారం తిరుపతి నుంచి వచ్చాడు. అంతే.. తెల్లవారే సరికి అవినాష్‌ శవమై ఇంటిముందు కనిపించాడు. దీంతో విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబసభ్యులు... యువతి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అమ్మాయి వారే తమ కుమారుడిని హత్య చేశారని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి కల్యాణి, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories