మాజీ ప్రేమికుడు వేధించడంతో యువతి ఆత్మహత్య

మాజీ ప్రేమికుడు వేధించడంతో యువతి ఆత్మహత్య
x
Highlights

మాజీ ప్రేమికుడు, అతని స్నేహితురాలు వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీలో చోటుచేసుకుంది. వైజాగ్‌కు చెందిన...

మాజీ ప్రేమికుడు, అతని స్నేహితురాలు వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీలో చోటుచేసుకుంది. వైజాగ్‌కు చెందిన మునివెంకట అంజలి ఉమామహేశ్వరి(23) అదే ప్రాంతానికి చెందిన జేజిబాబు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే జేజిబాబుకు వసుంధర అనే మరో యువతి పరిచయమైంది. వసుంధర, జేజిబాబు మధ్య సాహిత్యం పెరగడంతో ఉమామహేశ్వరి అతన్ని నిలదీసింది. ఈ క్రమంలో జేజిబాబుపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

కొద్దిరోజులకు గొడవ సద్దుమణిగింది. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్‌ ఆల్విన్‌కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత జేజిబాబు, వసుంధర నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories