చిన్నారి జషిత్ కిడ్నాప్ వెనక క్రికెట్ బెట్టింగ్ ముఠాలు?

చిన్నారి జషిత్ కిడ్నాప్ వెనక క్రికెట్ బెట్టింగ్ ముఠాలు?
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్​లో.. ఐదేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు...

తూర్పుగోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్​లో.. ఐదేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు జషిత్‌ జాడ కోసం తల్లడిల్లిపోయారు. 60 గంటల నిరీక్షణ తర్వాత సేప్‌గా ఇంటికి చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. క్లైమాక్స్‌లో కిడ్నాప్‌ మిస్టరీకి హ్యాపి ఎండ్‌ కార్డ్‌ పడింది. అయితే జషిత్ ఇంటికి సేఫ్‌గా చేరుకున్నప్పటికి ఆ కేసులో చిక్కుముడి మాత్రం వీడటం లేదు. ఈ కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు పలుకీలక విషయాలు రాబట్టారు.

జషిత్ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్బీ తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జషిత్ కిడ్నాప్‌లో మొత్తం 17 మంది బుకీలు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా జషిత్ కిడ్నాప్ వ్యవహారంలో బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు ఎక్కడ దాచారో ఆ స్థలాలను కూడా తెలుసుకున్నామని ఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories