ఇంటర్‌ ఫెయిల్.. మరో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్‌ ఫెయిల్.. మరో విద్యార్థిని ఆత్మహత్య
x
Highlights

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయియ్యానని 4 రోజుల క్రితం పురుగు మందు తాగిన కామిండ్ల లావణ్య (18) చికిత్స...

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయియ్యానని 4 రోజుల క్రితం పురుగు మందు తాగిన కామిండ్ల లావణ్య (18) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లావణ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై అఖిలపక్షాలు ప్రభుత్వంపై పోరాటానికి దిగాయి. సోమవారం ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories