కారులో గంజాయి.. గుట్టురట్టయిందిలా!

కారులో గంజాయి.. గుట్టురట్టయిందిలా!
x
Highlights

రోడ్డు ప్రమాదంతో కారులో గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి విజయవాడకు...

రోడ్డు ప్రమాదంతో కారులో గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి విజయవాడకు వెళుతున్న కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న బైక్ ను ఢీ కొట్టి కల్వర్టు లోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు అతడిని కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కారు తీవ్రంగా దెబ్బతింది.

ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారి పై విశాఖపట్నం నుండి విజయవాడ వైపు గావెళ్తున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కీ చెందిన టీఎస్ 24-b 5798 నెంబర్ గల తెల్లరంగు కారు అదుపుతప్పి రహదారి ప్రక్కనే గల గుంతలోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం లో ఆమార్గాన బైక్ పై వెళ్తున్న వ్యక్తి ని కూడ ఢీకొని కల్వర్టు లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన లో బైక్ పై వెళ్ళితున్న చోదకుడికి తీవ్ర గాయాలు అవ్వగా అతడిని కాకినాడ జిజిహెచ్ కి తరలించారు. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా కారులో 65 ప్యాకెట్లు(2.కేజీల ప్యాకెట్లు) సుమారు 200 కేజీల గంజాయిని ప్రత్తిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుoటున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు కొత్త దారులను ఎప్పటికప్పుడు ఎంచుకోవడం జరుగుతుందని సీ.ఐ వివరించారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టి నిందుతుల వెనుక ఎటువంటి శక్తులున్న వదిలిపెట్టకుండా అదుపులోకి తీసుకొంటామనీ సి:ఐ వి.మారుతి రావు మీడియాకు తెలియ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories