చదువులో తమకంటే ముందుందని బాలికపై అత్యాచారం.. వీడియో తీసి ప్రచారం

చదువులో తమకంటే ముందుందని బాలికపై అత్యాచారం.. వీడియో తీసి ప్రచారం
x
Highlights

పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించకపోతే ఏం జరుగుతుందో తెలిపే సంఘటన ఇది. పోలికలు తీసుకువచ్చి పిల్లల చడువుల విషయంలో ఎక్కువగా ఒత్తిడి చేస్తే వారెంత వికృతంగా...

పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించకపోతే ఏం జరుగుతుందో తెలిపే సంఘటన ఇది. పోలికలు తీసుకువచ్చి పిల్లల చడువుల విషయంలో ఎక్కువగా ఒత్తిడి చేస్తే వారెంత వికృతంగా తయావుతారో తెలిపే ఘటన ఇది. మానవత్వం సిగ్గుపడేలా కుటుంబంలోని తోటి సభ్యురాలిని చేరిచి.. వీడియో తీసి పైశాచికానందాన్ని పొందిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

యుపీలోని సీతాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాటశాల లో ఒకే కుటుంబానికి చెందినా నలుగురు విద్యార్థులు, ఒక విద్యార్థిని చదువుతున్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు ఫస్ట్ వచ్చింది. విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో సహజంగానే విద్యార్థులు తల్లిదండ్రులు ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోమని హెచ్చరించారు. దానిని అవమానంగా భావించారు ఆ నలుగురు విద్యార్థులు, దీంతో వారు అదే స్కూలుకు చెందిన ఓ ఉపాధ్యాయునితో కలిసి బాలికపై కసి తీర్చుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం శుక్రవారం బాలికను స్టాఫ్ రూమ్ కు తీసుకువెళ్ళారు. అక్కడ మత్తు మందు కలిపినా ఆహారం తినిపించారు. ఆమె స్పృహ తప్పి పడిపోయాకా ఐదుగురు ఆమెపై అత్యాచారం జరిపారు. దీనిని అంతట్నీ వీడియో తీసి వాట్సప్ లో షేర్ చేశారు. స్పృహలోకి వచ్చిన బాలిక తనకేమిందని అడిగితే స్పృహ తప్పి పడిపోయావంటూ నమ్మించారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories