వివాహేతరసంబంధానికి ఇద్దరు అమాయకులు బలి

వివాహేతరసంబంధానికి ఇద్దరు అమాయకులు బలి
x
Highlights

వివాహేతరసంబంధం ఇద్దరి అమాయకుల ప్రాణం తీసింది. విషం కలిపిన కూల్డ్రింక్ సేవించడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం...

వివాహేతరసంబంధం ఇద్దరి అమాయకుల ప్రాణం తీసింది. విషం కలిపిన కూల్డ్రింక్ సేవించడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం పంచాయతీలోని దళితవాడలో జరిగింది. గ్రామానికి చెందిన గోపి(38), పరిమళ దంపతులు, వీరికి ఇద్దరు సంతానం. పరిమళకు అదే గ్రామానికి చెందిన వేలాయుధం(40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మద్యానికి బానిసైన గోపికి మద్యం సీసా ఇచ్చే వేలాయుధం.. ఈ క్రమంలో పరిమలతో సన్నిహితంగా గడిపేవాడు. కొద్దిరోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. ఇటీవల గోపికి విషయం తెలిసి భార్యతో గొడవపెట్టుకున్నాడు. దాంతో పరిమళ పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. అయితే వేలాయుధం పరిమళకు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరాడు. గోపి ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో పరిమళ పుట్టింటిలోనే ఉంది.

దాంతో ఎలాగైనా పరిమళను భర్త ఇంటికి రప్పించాలని అనుకున్నాడు. దాంతో గోపిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా కూల్డ్రింక్ లో విషం కలిపాడు. రోజు రాత్రివేళ గోపి మద్యం సేవిస్తాడని తెలుసుకున్న వేలాయుధం కూల్డ్రింక్ లో విషం కలిపి గోపి స్నేహితుడు మేఘవర్ణం(35)కు ఇచ్చి ఇద్దరు కలిసి తాగమని చెప్పాడు. ఆ బాటిల్ తీసుకున్న మేఘవర్ణం గోపికి ఇచ్చాడు. అతను తాగగా మిగిలిన కూల్‌డ్రింక్‌ను విషం అని తెలియకపోవడంతో ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాడు మేఘవర్ణం. అయితే అందులో విషం ఉందని తెలియక మేఘవర్ణం భార్య మాధవి(28) ఆ కూల్డ్రింక్ ను సేవించింది. కొద్దిసేపటికే కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మాధవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు దృవీకరించారు. మరోవైపు అదే కూల్డ్రింక్ సేవించిన గోపి అపస్మారక స్థితిలో పడివుండటాన్ని స్థానికులు గమనించారు. అతను కూడా మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వేలాయుధం అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories