Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం

16 killed in separate accidents in Pakistans Sindh
x

 Road Accidents: నెత్తరోడిన రహదారులు..16 మంది దుర్మరణం

Highlights

Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బార్గా జిల్లా కమలాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీ కొట్టడంతో...

Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బార్గా జిల్లా కమలాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మరణించివారంతా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు చెందినవారు గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అటు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు మధుర నుండి లక్నోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ బస్సులో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు.

ఇందులో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో బస్సుపై అదుపు తప్పి హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories