నవ వధువుపై కన్నేసి అడ్డంగా దొరికిపోయిన యజమాని

నవ వధువుపై కన్నేసి అడ్డంగా దొరికిపోయిన యజమాని
x
Highlights

విశాఖలో నవ వధూవరుల కిడ్నాప్ కథ ముగిసింది. పోలీసుల పేరు చెప్పి రేవతి, సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే...

విశాఖలో నవ వధూవరుల కిడ్నాప్ కథ ముగిసింది. పోలీసుల పేరు చెప్పి రేవతి, సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఆ నవ దంపతులు రాజమండ్రిలో కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే విశాఖకు చెందిన రేవతి ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఆ కంపెనీ యజమాని శివప్రసాద్ ఆమెపై కన్నేశాడు. అయితే ఇటీవల సుబ్రహ్మణ్యంను ఆమె రిజిస్టర్ మ్యారేజి చేసుకుంది. దాంతో ఎలాగైనా ఆమెను దారికి తెచ్చుకోవాలని శ్రీనివాస్ పథకం రచించాడు.

అందులో భాగంగా పోలీసుల పేరు చెప్పి వారిద్దరిని కిడ్నాప్ చేయించాడు. వాహనం పోలీస్ స్టేషన్‌ కు కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్తుండడంతో దంపతులకు అనుమానం వచ్చింది. బాత్రూమ్‌ కు వెళ్లాలంటూ రాజమండ్రిలో వాహనాన్ని ఆపి. తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి అతనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివప్రసాద్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories