టీవీ ఛానల్ మార్చలేదని దారుణ హత్య

టీవీ ఛానల్ మార్చలేదని దారుణ హత్య
x
Highlights

తండ్రిని కుమారుడు దారుణంగా హతమార్చారుడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని ప్రకాశ్‌ బజార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మల్ల గోవర్దన్‌ (60) అనే వ్యక్తి తన కొడుకు సతీష్‌తో కలిసి నల్లగొండలోని ప్రకాశ్‌బజార్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన సతీష్ ఎప్పటిలాగే తప్ప తాగి ఇంటించి వచ్చాడు.

రోజురోజులు మనషుల మధ్య మానవత్వం మంటకలిసిపోతుంది. చిన్న చిన్న కారణాలు కూడా హత్యకు దారి తీస్తున్నాయి. టీవీ చానల్స్ కూడా హింసను ప్రేరేపిస్తున్నాయి. టీవీలో వచ్చే కార్యక్రమం మార్చనందుకు తండ్రిని కుమారుడు దారుణంగా హతమార్చారుడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని ప్రకాశ్‌ బజార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మల్ల గోవర్దన్‌ (60) అనే వ్యక్తి తన కొడుకు సతీష్‌తో కలిసి నల్లగొండలోని ప్రకాశ్‌బజార్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన సతీష్ ఎప్పటిలాగే తప్ప తాగి ఇంటించి వచ్చాడు.

కాగా.. అదే సమయంలో సతీష్ తండ్రి గోవర్థన్ టీవీ చూస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న సతీష్ తండ్రిని చానల్ మార్చాలని కోరాడు. అయితే తండ్రి గోవర్దన్‌ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి తీర్ర స్థాయికి చేరింది. మద్యం మత్తులో ఉన్న సతీష్‌ ఆవేశానికిలోనై రోకలితో తండ్రి తలపై బలంగా బాదాడు. దీంతో సతీష్ తండ్రి గోవర్థన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సతీష్ పరారీలో ఉన్నాడని అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories