ఘోర ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం..

ఘోర ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం..
x
Highlights

కృష్ణా జిల్లా మంగళగిరికి సమీపంలోని ఉండవల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, స్కూటర్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా...

కృష్ణా జిల్లా మంగళగిరికి సమీపంలోని ఉండవల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, స్కూటర్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories