నర్సు నిర్వాకం : రెండు ముక్కలుగా శిశువు

నర్సు నిర్వాకం : రెండు ముక్కలుగా శిశువు
x
Highlights

ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాకం మరోసారి బయటపడింది. నర్సు నిర్లక్ష్యంతో కొద్ది క్షణాల్లో పసికందు లోకాన్ని చూడకముందే పొట్టన పోట్టుకుని, ఆ తల్లికి తీరని శోకాన్ని మాత్రమే మిగిల్చింది ఓ నర్సు.

ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాకం మరోసారి బయటపడింది. నర్సు నిర్లక్ష్యంతో కొద్ది క్షణాల్లో పసికందు లోకాన్ని చూడకముందే పొట్టన పోట్టుకుని, ఆ తల్లికి తీరని శోకాన్ని మాత్రమే మిగిల్చింది ఓ నర్సు. ఈ ఘటన రాజస్థాన్, జైసల్మేర్ లోని రాంగఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.

ఇక వివరాల్లోకి వెళితే దీక్షా కన్వర్‌ అనే మహిళ కడుపుతో ఉంది. ఉన్నట్టుండి నొప్పులు రావడం జైసల్మేర్ లోని రాంగఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా ప్రసవ సమయంలో ఓ నర్సు శిశువును అతిబలవంతంగా బయటకు లాగడంతో పసికందు రెండు ముక్కలుగా విడిపోయింది. ఆ పసికందు కాళ్లు, మెడ భాగం వరకే బయటకు వచ్చి మిగిలిన తల భాగం మాత్రం తల్లి గర్భంలోనే ఉండిపోయింది. అయితే ఈ సంగతి తెలిసిస్తే తన ఉద్యోగంతో పాటు కేసు నమోదు అవుతుందనే భయంతో ఆ విషయం దాచిపెట్టింది నర్సు. వారికి ఏవో మాయమాటల చెప్పి లోపల మాయ ఉండిపోయిదంటూ కకమ్మ కబుర్లు చెప్పి హుటాహుటిన ఇంకో ఆసుపత్రికి తరిలించింది సదరు నర్సు.

ఆమెను వెంటనే జోధ్ పూర్ లో ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా మహిళ పరిస్థితి గమనించిన డాక్టర్లు కుటుంబ సభ్యులకు వివరించారు. ఇక ఆపరేషన్ చేసి తల్లి ప్రాణాలు రక్షించారు. ఇక దీంతో ఆగ్రహించిన బంధువులు, భర్త ఆసుపత్రి నిర్వాకంపై పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి పసికందు మొండెం భాగాన్ని జప్తు చేసుకున్నారు పోలీసులు. అనంతరం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories