మాయమైపోయిన మరో ముగ్గురు అమ్మాయిలు!

మాయమైపోయిన మరో ముగ్గురు అమ్మాయిలు!
x
Highlights

పది రోజుల్లో సుమారు 540 మంది తెలంగాణా వ్యాప్తంగా కనిపించకుండా పోయారన్న వార్త తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో ముగ్గురు అమ్మాయిలు...

పది రోజుల్లో సుమారు 540 మంది తెలంగాణా వ్యాప్తంగా కనిపించకుండా పోయారన్న వార్త తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో ముగ్గురు అమ్మాయిలు మాయమైపోయారు. వీరిలో ఒకరు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాగా, ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు. ఈ మూడు కేసులు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడం గమనార్హం.

పటాన్‌చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి స్థానిక ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని చెబుతున్న వారి తల్లిదండ్రులు ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీకి చెందిన శివాని అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైంది. నిన్న రాత్రి ఆమెను తన స్నేహితుడు కాలనీలో దింపినట్టు సీసీఫుటేజీ దృశ్యాలు లభ్యమయ్యాయి. నిన్న రాత్రి నుంచి తన కూతురు కన్పించకుండా పోయిందని శివాని తండ్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories