కొండచరియలు పడి 50 మంది మృతి!

కొండచరియలు పడి 50 మంది మృతి!
x
Highlights

మయన్మార్‌లో ఘోర చోటుచేసుకుంది. కాచిన్‌ రాష్ట్రంలో అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 50 మందికిపైగా మరణించగా పలువురు తీవ్రంగా గాయపడినట్టు...

మయన్మార్‌లో ఘోర చోటుచేసుకుంది. కాచిన్‌ రాష్ట్రంలో అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 50 మందికిపైగా మరణించగా పలువురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మిగిలిన వారికి కూడా తీవ్రంగా గాయాలయ్యానని వారు బతికిఉండే అవకాశాలు తక్కువేనని చెప్పారు. కొండచరియల ప్రమాదాన్ని మయన్మార్‌ సమాచార మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. చైనా సరిహద్దుల్లో రంగురాళ్ల కోసం ఇష్టారీతిన నిర్వహిస్తున్న మైనింగ్‌ కార్యకలాపాల వల్ల కొండచరియలు విరిగిపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories