హర్యానా ఫరీదాబాద్‌‌లో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చంపిన దుండగుడు..

హర్యానా ఫరీదాబాద్‌‌లో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చంపిన దుండగుడు..
x
Highlights

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. యువతిని కిడ్నాప్‌ చేయాలని భావించిన దుండగుడు...ఆమె ప్రతిఘంటించగానే కాల్పులకు తెగబడ్డాడు.

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. యువతిని కిడ్నాప్‌ చేయాలని భావించిన దుండగుడు...ఆమె ప్రతిఘంటించగానే కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు తౌసీఫ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇస్లాం మతంలో్కి మారమని తన కుమార్తెను తౌసీఫ్ ఒత్తిడి చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు నిరాకరించడంతో తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు.

నిఖితా అనే 21 ఏళ్ళ యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనని గత కొంతకాలంగా తౌసీఫ్‌ అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనని వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంలో తన తండ్రి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయినప్పటికీ తౌసీఫ్ ఆగడాలు ఆగలేదు. ఆ యువకుడి వేదనని భరించలేక కొన్నిరోజులు ఆ యువతి కాలేజ్‌కి వెళ్లడం మానేసింది. నిఖితకి డిగ్రీ ఎగ్జామ్స్ ఉండడంతో ఇంట్లోనే ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాసి బయటికి రాగానే ఆ దుండగుడు కారులో ఎక్కించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ యువతి ప్రతిఘటించడంతో నడి రోడ్డుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కారులో పరార్ అయ్యాడు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ పలు చోట్ల మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories