అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 20 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 20 మంది మృతి
x
Highlights

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కొంతమంది దుండగులు ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ...

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కొంతమంది దుండగులు ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, మరో 26మంది​తీవ్రంగాయలపాలయ్యారు. కాల్పుల సమయంలో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు పెట్టారు. అయితే ఈ వీడియో ట్విట్టర్‌ లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. కాల్పులు జరిపిన దుండగుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారి సంఖ్య కచ్చితంగా తెలీరాలేదని టెక్సాస్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాన్‌ ప్యాట్రిక్ ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా ఏడు రోజుల వ్యవధిలో వాల్‌మర్ట్‌ స్టోర్‌లో కాల్పులు జరగడం ఇది రెండోసారి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories