Bihar: పిడుగుపాటుకు 10 మంది మృతి..ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం

Bihar: బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గత 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. బాధితులకు సీఎం నితీశ్‌ కుమార్‌ ఆర్థిక సాయం ప్రకటించారు.

Dhivi
Published on: 8 July 2024 6:22 AM IST
Bihar: పిడుగుపాటుకు 10 మంది మృతి..ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
X

Bihar: పిడుగుపాటుకు 10 మంది మృతి..ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం

Bihar:బీహార్ లో పిడుగుపాటు మృత్యువు బీభత్సం సృష్టించింది. గత 24 గంటల్లో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందారు.భారీగా వర్షాలు కురుస్తున్నాయని..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బీహార్‌లోని వివిధ జిల్లాల్లో ఈ 10 మరణాలు సంభవించినట్లు పేర్కొంది. కాగా, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం నితీశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


దీనితో పాటు, ప్రతికూల వాతావరణంలో, ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతికూల వాతావరణం ఉన్నట్లయితే, పిడుగుపాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అనుసరించాలని పేర్కొన్నారు. గత 24 గంటల్లో పిడుగుపాటు కారణంగా నలందలో ఇద్దరు, వైశాలిలో ఒకరు, భాగల్‌పూర్‌లో ఒకరు, సహర్సాలో ఒకరు, రోహ్తాస్‌లో ఒకరు, సరన్‌లో ఒకరు, జాముయ్‌లో , భోజ్‌పూర్‌లో గోపాల్‌గంజ్‌లలో ఒకరు మరణించారు.

Dhivi

Dhivi

Next Story