27న ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ గర్జన

27న ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ గర్జన
x
Highlights

ఏపీకి ప్రత్యేకహోదాపై ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న భారీ ఎత్తున వైసీసీ పార్టీ నేతలు వంచనపై గర్జన దీక్షను చేపట్టనుంది....

ఏపీకి ప్రత్యేకహోదాపై ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న భారీ ఎత్తున వైసీసీ పార్టీ నేతలు వంచనపై గర్జన దీక్షను చేపట్టనుంది. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపర్చడంలో ప్రభుత్వాలతీరును నిలదీస్తూ వైసీపీ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈనెల27 ఉదయం పది గంటలకు నుంచి సాయంత్రం 4 గంటలవరకు వంచనపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎంపీలు, పార్టీనేతలు, రాజ్యసభ సభ్యులు పాల్గోననున్నారు. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ పోరాడుతున్న విషయం తెలిసిందే కాగా దానిలో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories