విభజన హామీల అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది: వైసీపీ ఎంపీలు

arun
By arun
Updated on: 24 Dec 2018 12:51 PM IST
విభజన హామీల అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది: వైసీపీ ఎంపీలు
X

విభజన హామీల అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని, మంత్రివర్గంలో ఉంటూ నిరసనలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే అని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ నిరసన కొనసాగిస్తామని అన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేయాలని కోరుతూ మూడో రోజు కూడా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం దగ్గర ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాతో, రాష్ట్రానికి న్యాయం చేయలంటూ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

arun

arun

Next Story